ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం
రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ శిక్షణకు పది మంది టీచర్లు
విజయవాడలో మొదలైన శిక్షణ
19వ తేదీ నుంచి మండలస్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ తరగతులు
జనవరిలో మండలాల్లో శిక్షణా తరగతులు
సంక్రాంతి సెలవులకు ముందు, తరువాత బ్యా చ్ లవారీగా ట్రైనింగ్
అనంతరం నాలుగు నెలలపాటు ఆన్ లైన్ శిక్షణ
'దీక్ష' పేరుతో ప్రత్యేకంగా యాప్
ఆడియో, వీడియో పాఠాలను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
బోధనకు మెటీరియల్ రూపకల్పన
వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భాషావేత్తలు, మాతృభాషా ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకతను పక్కన పెట్టి, ఆంగ్ల బోధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లంలో బోధించేందుకు ఆయా టీచర్లకు దశలవారీగా మౌఖిక, ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం జిల్లా నుంచి పది మంది ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేశారు. వీరిలో ఆరుగురు ఆంగ్లం బోధించే స్కూల్ అసిస్టెంట్లుకాగా మరో నలుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన రిసోర్స పర్సన్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అవసరమైన మెలకువల కోసం విజయవాడలో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. తరువాత దశలో మండలానికి నలుగురు చొప్పున ఎంపికచేసిన టీచర్లకు విజయవాడలో శిక్షణ పొందిన పది మంది రిసోర్పర్సన్లు శిక్షణ ఇస్తారు. వీరికి ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మూడో దశలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధించే టీచర్లకు, మండలాల నుంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభం ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పారాలు బోధించే ఉపాధ్యాయులు 200 మందికిపైగా ఉంటారని, వీరికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
సంక్రాంతి పండుగ సెలవులకు ముందు ఒక బ్యాచ్ కు, తరువాత మరో బ్యాంకు శిక్షణ ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించారు. శిక్షణ తరగతుల తరువాత ప్రతి టీచర్ సుమారు నాలుగు నెలలపాటు ఆన్లైన్ కోర్సు చేయాలి. దీనికి సంబంధించి 'దీక్ష యాప్ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది. ఆడియో, వీడియో పాఠాలను డౌన్లోడ్ చేసుకునే వెసులబాటు కల్పించారు. శిక్షణ తరగతులు నిర్వహించే రిసోర్స్ పర్సన్లకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. పాఠశాల స్థాయిలో టీచర్లకు బోధనకు అవసరమైన మెటీరియల్ను జిల్లా కామన్ పరీక్షల బోర్డు రూపొందించింది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన అన్ని పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు మాత్రమే బోధన చేస్తారు. నాలుగు, ఐదు తరగతులకు 'పరిసరాల విజ్ఞానం' అనే సబ్జెక్టు అదనంగా ఉంటుంది. ఆరో తరగతి వచ్చేసరికి సోషల్ స్టడీతోపాటు మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి.
జీవీఎంసీ, ఏపీఆర్ఎస్, మోడల్ పాఠశాలలు, సోషల్, ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు సక్సెస్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఇప్పటికే అమలులో ఉంది. ప్రాథమిక స్థాయిలో రెండేళ్ల క్రితం 176 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే వుంటుంది.
రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్ శిక్షణకు పది మంది టీచర్లు
విజయవాడలో మొదలైన శిక్షణ
19వ తేదీ నుంచి మండలస్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ తరగతులు
జనవరిలో మండలాల్లో శిక్షణా తరగతులు
సంక్రాంతి సెలవులకు ముందు, తరువాత బ్యా చ్ లవారీగా ట్రైనింగ్
అనంతరం నాలుగు నెలలపాటు ఆన్ లైన్ శిక్షణ
'దీక్ష' పేరుతో ప్రత్యేకంగా యాప్
ఆడియో, వీడియో పాఠాలను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
బోధనకు మెటీరియల్ రూపకల్పన
వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భాషావేత్తలు, మాతృభాషా ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకతను పక్కన పెట్టి, ఆంగ్ల బోధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లంలో బోధించేందుకు ఆయా టీచర్లకు దశలవారీగా మౌఖిక, ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం జిల్లా నుంచి పది మంది ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేశారు. వీరిలో ఆరుగురు ఆంగ్లం బోధించే స్కూల్ అసిస్టెంట్లుకాగా మరో నలుగురు సెకండరీ గ్రేడ్ టీచర్లు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన రిసోర్స పర్సన్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అవసరమైన మెలకువల కోసం విజయవాడలో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. తరువాత దశలో మండలానికి నలుగురు చొప్పున ఎంపికచేసిన టీచర్లకు విజయవాడలో శిక్షణ పొందిన పది మంది రిసోర్పర్సన్లు శిక్షణ ఇస్తారు. వీరికి ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మూడో దశలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధించే టీచర్లకు, మండలాల నుంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభం ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పారాలు బోధించే ఉపాధ్యాయులు 200 మందికిపైగా ఉంటారని, వీరికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
సంక్రాంతి పండుగ సెలవులకు ముందు ఒక బ్యాచ్ కు, తరువాత మరో బ్యాంకు శిక్షణ ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించారు. శిక్షణ తరగతుల తరువాత ప్రతి టీచర్ సుమారు నాలుగు నెలలపాటు ఆన్లైన్ కోర్సు చేయాలి. దీనికి సంబంధించి 'దీక్ష యాప్ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది. ఆడియో, వీడియో పాఠాలను డౌన్లోడ్ చేసుకునే వెసులబాటు కల్పించారు. శిక్షణ తరగతులు నిర్వహించే రిసోర్స్ పర్సన్లకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. పాఠశాల స్థాయిలో టీచర్లకు బోధనకు అవసరమైన మెటీరియల్ను జిల్లా కామన్ పరీక్షల బోర్డు రూపొందించింది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన అన్ని పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు మాత్రమే బోధన చేస్తారు. నాలుగు, ఐదు తరగతులకు 'పరిసరాల విజ్ఞానం' అనే సబ్జెక్టు అదనంగా ఉంటుంది. ఆరో తరగతి వచ్చేసరికి సోషల్ స్టడీతోపాటు మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి.
జీవీఎంసీ, ఏపీఆర్ఎస్, మోడల్ పాఠశాలలు, సోషల్, ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు సక్సెస్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఇప్పటికే అమలులో ఉంది. ప్రాథమిక స్థాయిలో రెండేళ్ల క్రితం 176 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే వుంటుంది.
No comments:
Post a Comment