ఈఎస్సార్ --ఉద్యోగుల సమాచారం డిజిటలీకరణ
ఇక ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు
➤ఇక ఎవరి ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ.. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ (హెచ్ సీఎం) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.
➤ఇప్పటికే ఆర్ధిక శాఖ అనుబంధ విభాగాల ఉద్యోగులకు ఈ వ్యవస్థ ద్వారా జీత భత్యాలను చెల్లిస్తోంది. దశల వారీగా మిగతా శాఖల ఉద్యోగులందరికీ ఈ వ్యవస్థ ద్వారానే జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.
➤ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు డిజిటలీకరణ చేయనున్నారు.
➤ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ జీత భత్యాల కోసం డ్రాయింగ్ అండ్ డిస్ బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవోలు) చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
➤ఇప్పటికే ఆర్ధిక శాఖ.. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎస్ఎంఎస్) ద్వారా నగదు చెల్లింపులు చేస్తోంది. ఈ చెల్లింపులు ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే సాగుతున్నాయి. దీనికి అనుబంధంగా ఇప్పుడు ఉద్యోగుల చెల్లింపుల కోసం హెచ్ సీఎం వ్యవస్థను తీసుకువస్తోంది.
➤ఈ ప్రక్రియలో ఉద్యోగుల ఇంక్రిమెంట్, ప్రమోషన్, వంటి ప్రతి అంశాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుంది.
➤పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలతో పాటు మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు కాల క్రమంలో నిర్ణీత గడువును నిర్ధారించనున్నారు.
➤ఉద్యోగుల సర్వీసు పుస్తకాలన్నింటినీ కంప్యూటరీకరించడంతో అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంటాయి.
➤ప్రతి నెలా ఉద్యోగులకు రావాల్సిన పరిహారాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతాయి. దీని కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా ఇంక్రిమెంట్లు, ఎనౌక్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకానెల నమోదవుతాయి.
➤తమకు ఇంక్రిమెంట్ కావాలని, జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు.
➤ప్రభుత్వం కరువు భత్యం పెంచితే తక్షణం ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుంది.
ఇక ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు
➤ఇక ఎవరి ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ.. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ (హెచ్ సీఎం) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.
➤ఇప్పటికే ఆర్ధిక శాఖ అనుబంధ విభాగాల ఉద్యోగులకు ఈ వ్యవస్థ ద్వారా జీత భత్యాలను చెల్లిస్తోంది. దశల వారీగా మిగతా శాఖల ఉద్యోగులందరికీ ఈ వ్యవస్థ ద్వారానే జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.
➤ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు డిజిటలీకరణ చేయనున్నారు.
➤ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ జీత భత్యాల కోసం డ్రాయింగ్ అండ్ డిస్ బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవోలు) చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
➤ఇప్పటికే ఆర్ధిక శాఖ.. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎస్ఎంఎస్) ద్వారా నగదు చెల్లింపులు చేస్తోంది. ఈ చెల్లింపులు ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే సాగుతున్నాయి. దీనికి అనుబంధంగా ఇప్పుడు ఉద్యోగుల చెల్లింపుల కోసం హెచ్ సీఎం వ్యవస్థను తీసుకువస్తోంది.
➤ఈ ప్రక్రియలో ఉద్యోగుల ఇంక్రిమెంట్, ప్రమోషన్, వంటి ప్రతి అంశాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుంది.
➤పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలతో పాటు మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు కాల క్రమంలో నిర్ణీత గడువును నిర్ధారించనున్నారు.
➤ఉద్యోగుల సర్వీసు పుస్తకాలన్నింటినీ కంప్యూటరీకరించడంతో అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంటాయి.
➤ప్రతి నెలా ఉద్యోగులకు రావాల్సిన పరిహారాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతాయి. దీని కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా ఇంక్రిమెంట్లు, ఎనౌక్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకానెల నమోదవుతాయి.
➤తమకు ఇంక్రిమెంట్ కావాలని, జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు.
➤ప్రభుత్వం కరువు భత్యం పెంచితే తక్షణం ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుంది.
No comments:
Post a Comment