ఐటీ రిటర్నుల గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువును నవంబర్ 30వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటించింది.రెండురోజుల క్రితమే ఐటీ రిటర్నుల గడువు ఈ నెల 31కి పెంచిన కేంద్రం.. తాజాగా మరో నాలుగు నెలలు అవకాశం ఇచ్చింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నవంబరు 30 దాకా రిటర్నులను దాఖలు చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఇది పన్ను చెల్లింపుదారులు మరింత ప్రణాళికబద్ధంగా వ్యవహరించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం' అని ఐటీ శాఖ వెల్లడించింది.ఆదాయపు పన్ను కడుతున్నప్పుడు హౌసింగ్ లోన్లు, జీవిత బీమా పీపీఎఫ్.. ఇతరత్రా మినహాయింపులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. వీటి కింద ఈ నెల 31వ తేదీ దాకా చేసిన అన్ని రకాల మదింపులను 2019-20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగష్టు 15వ తేదీకి పెంచింది.
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువును నవంబర్ 30వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటించింది.రెండురోజుల క్రితమే ఐటీ రిటర్నుల గడువు ఈ నెల 31కి పెంచిన కేంద్రం.. తాజాగా మరో నాలుగు నెలలు అవకాశం ఇచ్చింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నవంబరు 30 దాకా రిటర్నులను దాఖలు చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఇది పన్ను చెల్లింపుదారులు మరింత ప్రణాళికబద్ధంగా వ్యవహరించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం' అని ఐటీ శాఖ వెల్లడించింది.ఆదాయపు పన్ను కడుతున్నప్పుడు హౌసింగ్ లోన్లు, జీవిత బీమా పీపీఎఫ్.. ఇతరత్రా మినహాయింపులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. వీటి కింద ఈ నెల 31వ తేదీ దాకా చేసిన అన్ని రకాల మదింపులను 2019-20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగష్టు 15వ తేదీకి పెంచింది.
No comments:
Post a Comment