పుస్తక నేస్తం ప్రోగ్రాం అమలు - సూచనలు
పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు - ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు-సూచనలు - జారీ...
సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు
మెమో.నెం. SS-15024/79/2020-SAMO-SSA, తేది: 11.07.2020
File No.SS-15024/79/2020-SAMO-SSA
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
మెమో.నెం. SS-15024/79/2020-SAMO-SSA, తేది: ApprovedDate.
విషయం : సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు-ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు - సూచనలు - జారీ.
ఆదేశాలు:
1. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా:
2. పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా బాలసాహిత్యాన్ని పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫు నుంచి కథలు, సైన్సు, గణితం, విజ్ఞానం, బాలసాహిత్యం పుస్తకాలను పంపిణీ చేయనుంది.
3. 2019 - 20 విద్యా సంవత్సరానికి గానూ 'భారతీయ భాషాధ్యయన కేంద్రం - మైసూరు' వారి నుంచి ప్రస్తుతానికి 82 పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందనున్నాయి. వాటిని విద్యార్థులతో చదివించి వారిలో పుస్తక పఠనాసక్తిని, మేధస్సును పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది.
4. అయితే, కోవిడ్ - 19 మహమ్మారి సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ, పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా 'పుస్తక నేస్తం' పేరిట సమగ్ర శిక్షా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పిల్లలకు బాలసాహిత్యాన్ని చదివించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తున్నాం.
ప్రధానోపాధ్యాయులకు సూచనలు
• సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి ప్రతి పాఠశాలకూ పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు అందుతాయి.
• అందిన పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాబితా (కేటలాగు) తయారు చేసుకోవాలి.
• వాటిని గ్రంథాలయ స్టాకు రిజిస్టరులో, కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి.
• పుస్తకాలు చించకుండా, మడత పెట్టకుండా జాగ్రత్తగా చదవమని పిల్లలకు చెప్పాలి.
• పుస్తక పఠనంలో ప్రతి విద్యార్థిని, పాఠశాల తల్లిదండ్రుల కమిటీని భాగస్వామ్యం చేయాలి.
• ఒక్కో విద్యార్థికి ఇచ్చిన పుస్తకాల జాబితాను తరగతి ఉపాధ్యాయులతో నమోదు చేయాలి.
ఉదాహరణకు:
►వ.సం
►పుస్తకం పేరు
►పుస్తకం నంబరు
►రచయిత
►విద్యార్థి పేరు
►తరగతి
►ఇచ్చిన తేదీ
►తిరిగివచ్చిన తేదీ
►విద్యార్థి సంతకం
• ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆ పుస్తకాలు అందే విధంగ చూడాలి.
• పాఠశాల గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా ఆసక్తిని, అభిరుచిని పెంపొందింపజేయడం ద్వారా మేధస్సు పెరుగుతుందని పిల్లల్లో గ్రంథాలయ ఆవశ్యకతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి.
• ఎవరికి ఏ పుస్తకం ఇచ్చారో, తేదీ, తిరిగి తీసుకున్న తేది రాసుకోమని చెప్పాలి.
• ప్రతి విద్యార్థికి పుస్తకం అందేలా తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యత వహించాలి.
*విద్యార్థుల భాగస్వామ్యం*
• కోవిడ్ - 19 మహమ్మారి దృష్ట్యా ప్రతి విద్యార్థి తమ తమ ఇళ్లకు పుస్తకాలు తీసుకెళ్లి చక్కగా చదివేలా చేయాలి.
• అందులో కథ, నీతి, ఇతర విజ్ఞాన విషయాలు, బొమ్మలు వంటివి విద్యార్థులు గ్రహించాలి.
• విద్యార్థి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మరో విద్యార్థికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఎదుటి విద్యార్థి దగ్గర పుస్తకాన్ని తీసుకోవాలి.
• ఆ విధంగా పాఠశాలలు తిరిగి తెరిచేదాకా విద్యార్థులు తాము తీసుకున్న పుస్తకాలు తమలో తాము సర్కులేట్ చేసుకోవాలి.
• పాఠశాలలు తిరిగి తెరిచిన తరువాత ఆ పుస్తకాలను బాధ్యతగా పాఠశాలకు అప్పగించాలి.
వాడ్రేవు చినవీరభద్రుడు
రాష్ట్రపథక నిర్వహణాధికారి, సమగ్ర శిక్షా
ఈ ప్రతిని వీరికి పంపడమైనది.
1. అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు
2. అందరు సమగ్ర శిక్షా అదనపు కో- ఆర్డినేటర్లకు
3. కమీషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆం.ప్ర. వారికి,
4. దీని ప్రతిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సమాచారం నిమిత్తం సమర్పించనైనది.
5. గౌరవనీయ పాఠశాల విద్యాశాఖామాత్యుల కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారికి.
➤ Download Proceedings
పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు - ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు-సూచనలు - జారీ...
సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు
మెమో.నెం. SS-15024/79/2020-SAMO-SSA, తేది: 11.07.2020
File No.SS-15024/79/2020-SAMO-SSA
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
మెమో.నెం. SS-15024/79/2020-SAMO-SSA, తేది: ApprovedDate.
విషయం : సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు-ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు - సూచనలు - జారీ.
ఆదేశాలు:
1. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా:
2. పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా బాలసాహిత్యాన్ని పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫు నుంచి కథలు, సైన్సు, గణితం, విజ్ఞానం, బాలసాహిత్యం పుస్తకాలను పంపిణీ చేయనుంది.
3. 2019 - 20 విద్యా సంవత్సరానికి గానూ 'భారతీయ భాషాధ్యయన కేంద్రం - మైసూరు' వారి నుంచి ప్రస్తుతానికి 82 పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందనున్నాయి. వాటిని విద్యార్థులతో చదివించి వారిలో పుస్తక పఠనాసక్తిని, మేధస్సును పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది.
4. అయితే, కోవిడ్ - 19 మహమ్మారి సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ, పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా 'పుస్తక నేస్తం' పేరిట సమగ్ర శిక్షా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పిల్లలకు బాలసాహిత్యాన్ని చదివించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తున్నాం.
ప్రధానోపాధ్యాయులకు సూచనలు
• సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి ప్రతి పాఠశాలకూ పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు అందుతాయి.
• అందిన పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాబితా (కేటలాగు) తయారు చేసుకోవాలి.
• వాటిని గ్రంథాలయ స్టాకు రిజిస్టరులో, కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి.
• పుస్తకాలు చించకుండా, మడత పెట్టకుండా జాగ్రత్తగా చదవమని పిల్లలకు చెప్పాలి.
• పుస్తక పఠనంలో ప్రతి విద్యార్థిని, పాఠశాల తల్లిదండ్రుల కమిటీని భాగస్వామ్యం చేయాలి.
• ఒక్కో విద్యార్థికి ఇచ్చిన పుస్తకాల జాబితాను తరగతి ఉపాధ్యాయులతో నమోదు చేయాలి.
ఉదాహరణకు:
►వ.సం
►పుస్తకం పేరు
►పుస్తకం నంబరు
►రచయిత
►విద్యార్థి పేరు
►తరగతి
►ఇచ్చిన తేదీ
►తిరిగివచ్చిన తేదీ
►విద్యార్థి సంతకం
• ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆ పుస్తకాలు అందే విధంగ చూడాలి.
• పాఠశాల గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా ఆసక్తిని, అభిరుచిని పెంపొందింపజేయడం ద్వారా మేధస్సు పెరుగుతుందని పిల్లల్లో గ్రంథాలయ ఆవశ్యకతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి.
• ఎవరికి ఏ పుస్తకం ఇచ్చారో, తేదీ, తిరిగి తీసుకున్న తేది రాసుకోమని చెప్పాలి.
• ప్రతి విద్యార్థికి పుస్తకం అందేలా తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యత వహించాలి.
*విద్యార్థుల భాగస్వామ్యం*
• కోవిడ్ - 19 మహమ్మారి దృష్ట్యా ప్రతి విద్యార్థి తమ తమ ఇళ్లకు పుస్తకాలు తీసుకెళ్లి చక్కగా చదివేలా చేయాలి.
• అందులో కథ, నీతి, ఇతర విజ్ఞాన విషయాలు, బొమ్మలు వంటివి విద్యార్థులు గ్రహించాలి.
• విద్యార్థి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మరో విద్యార్థికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఎదుటి విద్యార్థి దగ్గర పుస్తకాన్ని తీసుకోవాలి.
• ఆ విధంగా పాఠశాలలు తిరిగి తెరిచేదాకా విద్యార్థులు తాము తీసుకున్న పుస్తకాలు తమలో తాము సర్కులేట్ చేసుకోవాలి.
• పాఠశాలలు తిరిగి తెరిచిన తరువాత ఆ పుస్తకాలను బాధ్యతగా పాఠశాలకు అప్పగించాలి.
వాడ్రేవు చినవీరభద్రుడు
రాష్ట్రపథక నిర్వహణాధికారి, సమగ్ర శిక్షా
ఈ ప్రతిని వీరికి పంపడమైనది.
1. అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు
2. అందరు సమగ్ర శిక్షా అదనపు కో- ఆర్డినేటర్లకు
3. కమీషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆం.ప్ర. వారికి,
4. దీని ప్రతిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సమాచారం నిమిత్తం సమర్పించనైనది.
5. గౌరవనీయ పాఠశాల విద్యాశాఖామాత్యుల కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారికి.
➤ Download Proceedings
No comments:
Post a Comment