ఆన్లైన్ తరగతులపై కేంద్రం మార్గదర్శకాలు--ప్రి-ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అర గంటే
దిల్లీ: ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ‘ప్రజ్ఞాత’ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది.
➧ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు స్క్రీన్లపై గడిపే సమయం పెరిగిపోతోందన్న తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నాకే వీటిని రూపొందించినట్టు పేర్కొంది.
➧తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రి-ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు రోజులో 30 నిమిషాలు మించరాదు.
➧1-8 తరగతులకు రెండు విడతలుగా, ఒక్కో విడతలో 45 నిమిషాలకు మించకుండా నిర్వహించొచ్చు.
➧9-12 తరగతులకు నాలుగు విడతలుగా, ఒక్కో విడతలో 30-45 నిమిషాల వ్యవధిలో తరగతులు నిర్వహించవచ్చు.
➧ప్రస్తుతానికి విద్యార్థుల కోణంలోనే ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు.
➧కరోనా కారణంగా సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికుల పిల్లల చదువుల విషయంలోనూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.
➧ఇలాంటి విద్యార్థుల పేర్లను పాఠశాలల రికార్డుల నుంచి తొలగించవద్దని, తాత్కాలికంగా అందుబాటులో లేరని మాత్రమే నమోదు చేయాలని కోరింది.
➧పరిస్థితులు మెరుగయ్యాక వారు తిరిగొచ్చే అవకాశం ఉండడంతో ఈ సూచన చేసింది.
అలాగే సొంతూళ్లకు వచ్చిన పిల్లలకు ఒక్క గుర్తింపు రుజువు మినహా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే స్థానిక పాఠశాలల్లో చేర్చుకొనేలా రాష్ట్రాలు ఆదేశాలు ఇవ్వొచ్చని పేర్కొంది.
దిల్లీ: ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ‘ప్రజ్ఞాత’ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది.
➧ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు స్క్రీన్లపై గడిపే సమయం పెరిగిపోతోందన్న తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నాకే వీటిని రూపొందించినట్టు పేర్కొంది.
➧తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రి-ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు రోజులో 30 నిమిషాలు మించరాదు.
➧1-8 తరగతులకు రెండు విడతలుగా, ఒక్కో విడతలో 45 నిమిషాలకు మించకుండా నిర్వహించొచ్చు.
➧9-12 తరగతులకు నాలుగు విడతలుగా, ఒక్కో విడతలో 30-45 నిమిషాల వ్యవధిలో తరగతులు నిర్వహించవచ్చు.
➧ప్రస్తుతానికి విద్యార్థుల కోణంలోనే ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు.
➧కరోనా కారణంగా సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికుల పిల్లల చదువుల విషయంలోనూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.
➧ఇలాంటి విద్యార్థుల పేర్లను పాఠశాలల రికార్డుల నుంచి తొలగించవద్దని, తాత్కాలికంగా అందుబాటులో లేరని మాత్రమే నమోదు చేయాలని కోరింది.
➧పరిస్థితులు మెరుగయ్యాక వారు తిరిగొచ్చే అవకాశం ఉండడంతో ఈ సూచన చేసింది.
అలాగే సొంతూళ్లకు వచ్చిన పిల్లలకు ఒక్క గుర్తింపు రుజువు మినహా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే స్థానిక పాఠశాలల్లో చేర్చుకొనేలా రాష్ట్రాలు ఆదేశాలు ఇవ్వొచ్చని పేర్కొంది.
No comments:
Post a Comment