విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
అంకితభావంతోనే లక్ష్య సాధన
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెర వేరేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ లోని రాష్ట్ర సమ గ్ర శిక్ష కార్యాలయంలో శుక్రవారం జరిగిన రెండో కార్యనిర్వహాక సమావేశంలో కస్తూర్బా విద్యాలయం పనితీరు, బడి బయట పిల్లలు, సివిల్ పనులు, నాణ్యమైన విద్య, నాడు-నేడు పనులపై మంత్రి సురేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తు న్నట్లు చెప్పారు. సీఎం ఆశయం, ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చేందుకు కృషిచేయాలని అధికారులకు పిలుపు నిచ్చారు. గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యా లయాలను బలోపేతం చేసేందుకు చేపట్టాలసిన చర్యలపై అధికారులతో సమీక్షిం చారు. నాడు-నేడు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఆర్థికపరమైన అంశా లను మంత్రి చర్చించారు. రెండో విడత నాడు-నేడు పాఠశాల దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. వంట గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల న్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై గవర్నింగ్ బాడీ సమావేశంలో చర్చిం చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వి. చినవీరభద్రుడు
సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment