సీఎం కార్యాలయం నుంచి దస్ర్తం వచ్చిన వెంటనే.. ఉపాధ్యాయ బదిలీల కోసం ఇతరత్రా ఏర్పాట్లతో రెడీ
- ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కోసం సర్వత్రా ఆసక్తి ఉంది.
- ముఖ్యమంత్రి జగన్ సైతం టీచర్ల బదిలీలు చేయాలని ఇటీవలే అధికారులతో అన్నారు.
- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుందని చెప్పిన గడువు కూడా ముగిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉపాధ్యాయుల బదిలీ ఫైలు ఉందని సమాచారం. అక్కడి నుంచి సంతకంతో వచ్చిన వెంటనే ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
- మరో వైపు విద్యాశాఖ కమిషనర్ సైతం బదిలీలు చేపట్టేందుకు వీలుగా పూర్తి సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి తీసుకు వచ్చారు.
- రేషన్ లైజేషన్ కు సంబంధించి జిల్లా విద్యాధికారులు సిద్ధం చేసిన నివేదికలు, సంబంధిత అంశాల పరిశీలన ప్రక్రియ సైతం పూర్తయింది. ప్రస్తుతం ఏ స్కూలులో ఏ పోస్టు ఖాళీగా ఉంది,
- 5 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? 8 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? ఏ స్కూలులో ఎందరు అనే అంశాలపై సిద్ధమైన సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ మరో మారు తనిఖీ చేస్తోంది.
- జిల్లా విద్యాధికారుల ద్వారా ఆయా పాఠశాలలకు ఈ సమాచారం పంపి ప్రధానోపాధ్యాయుల నుంచి సరి చూసి అధికారికంగా ఖరారు చేసే ప్రక్రియ సాగుతోంది. రెండు రోజుల్లో ఈ వివరాలన్నీ పక్కాగా ఖరారవుతాయి.
- మరో వైపు టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో చేపట్టేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ కూడా సిద్ధమవువతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
- ఉపాధ్యాయులు ఆన్ లైన్ బదిలీలను వ్యతిరేకిస్తున్నా అదే విధానం లోనే ప్రక్రియ చేపట్టబోతున్నారు.
- ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దస్ర్తం వచ్చిన వెంటనే బదిలీలకు ప్రాథమిక విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది.
No comments:
Post a Comment