Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ముందు లిమిటెడ్ తరువాత రెగ్యులర్ డీఎస్సీ

ముందు లిమిటెడ్  తరువాత రెగ్యులర్ డీఎస్సీ

403 బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

రెగ్యులర్ డీఎస్సీకి 15 వేలకు పైగా పోస్టుల అందుబాటు

రెగ్యులర్ డీఎస్సీకి ముందు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్

 ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో టెట్ సిలబస్ మార్పు

కసరత్తు చేస్తున్న ఎస్సీఈఆర్టీ

 రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జరు గుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి లిమిటెడ్ డీఎస్సీ నిర్వహించనున్నారు. గత డీఎస్సీల్లో మిగిలిపో యిన రిజర్వుడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు మార్చిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత టీచర్ల బదిలీల ప్రక్రియ అనంతరం 'లిమిటెడ్ డీఎస్సీ ని నిర్వహించను న్నారు. జిల్లాల వారీగా బ్యాక్ లాగ్ పోస్టులను రోస్టర్ వారీగా కేటాయించి లిమిటెడ్ డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లిమిటెడ్ డీఎస్సీకి 403 బ్యాక్ లాగ్ పోస్టులను అధికారులు గుర్తించారు. వీటిలో జిల్లా, మండల పరిషత్ ప్రభుత్వ, మున్సిపల్, సంక్షేమశాఖల స్కూళ్ల పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏళ్లుగా భర్తీ కాలేదు. ఈ లిమిటెడ్ డీఎస్సీ వల్ల ముందు ఆయా వర్గాల వారికి మేలు చేకూరనుంది. ఆ పోస్టులకు అర్హులైన ఆ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే వాటిని జనరల్ కోటాలో తదుపరి డీఎస్సీలో భర్తీ చేసే అవకాశాలున్నాయి.

2019 స్పెషల్ డీఎస్సీ లో 78 పోస్టులు ఖాళీ

2019లో స్పెషల్ డీఎస్సీలో మిగిలిన పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వను న్నారు. అప్పట్లో 600కు పైగా పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 78 పోస్టులు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ ఇవ్వా ల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పూర్తయిన తరువాత రెగ్యులర్ డీఎస్సీకి చర్యలు తీసుకోనున్నారు. ఈ డీఎస్సీకి ముందుగా టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవే శపెడుతున్న నేపథ్యంలో ఈసారి టెట్ సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఈ కసరత్తు చేస్తోంది. ఆంగ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించేలా సిలబస్ ఉంటుందని, నైపుణ్యంగల అభ్యర్థులను టీచర్ పోస్టులకు సిద్ధం చేసేలా టెట్ నిర్వహిస్తామని అధికారులు పేర్కొ న్నారు. టెట్ అనంతరం రెగ్యులర్ డీఎస్సీని నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. బదిలీలు పూర్తయితే ఈ డీఎస్పీకి ఎన్ని పోస్టులో తేలనుంది 2020-21 విద్యాసంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులను నోటిఫై చేయా లని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. కరోనా వల్ల విద్యాసంవత్సరం అస్తవ్యస్తమైనందున ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి ఇటీవల 2018 డీఎస్పీకి సంబంధించి మూడువేల ఎస్టీటీ పోస్టులను భర్తీచే శారు. ప్రస్తుత బదిలీల్లో గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించినందున ఆమేరకు రానున్న డీఎస్సీకి పోస్టులు అందుబాటులో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన విద్యావిధాన చట్టం ప్రకారం టీచర్, విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండాలి. కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా, టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎంతమేర అవసరముందో విద్యాశాఖ ప్రతిపాదనలు ఇస్తే ప్రభుత్వ అనుమతితో ఆమేరకు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించే అవకాశముంటుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND