కడప: కేజీబీవీలో 12 మందికి కరోనా
పెనగలూరు: కడప జిల్లా పెనగలూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
➧గురువారం పాఠశాలలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురు విద్యార్థినులకు కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది అంతా కలిపి 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో 9 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది.
➧పాజిటివ్ వచ్చిన వారిలో 10 మంది విద్యార్థినులు, ఒక వంట మనిషి, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. సమచారం అందిన వెంటనే ఆర్ఐ రవి, వీడీవో సురేశ్, వీఆర్వో ప్రతాప్తో కలిసి తహసీల్దార్ శ్రీధర్రావు పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయించారు. విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వారి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లగానే వెంటనే పాఠశాలకు వెళ్లి వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.
➧ విద్యార్థులను 14 రోజుల పాటు బయటకు పంపించొద్దని తల్లిదండ్రులకు తహసీల్దార్ సూచించారు.
No comments:
Post a Comment