కొత్త బడికి 36 వేల మంది టీచర్లే!
ఉపాధ్యాయ బదిలీల పర్వం దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 76వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 68,800మందికి ఆన్లైన్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో 36వేల మంది మాత్రమే తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరిపోయారు. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అలాట్ అయిన పాఠశాల సంతృప్తికరంగా లేకపోవడంతో వేలాది మంది టీచర్లు వాటిల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలోనే వారు కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది హైస్కూలు హెడ్మాస్టర్ల బదిలీ పెండింగ్లో పడింది. అలాగే ఏడు జిల్లాల్లో సుమారు 4,200 మంది స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ) ఉపాధ్యాయుల బదిలీలు కూడా నిలిచిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారమయ్యాకే వీరికి బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. కాగా, బదిలీ ఉత్తర్వులపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 21నుంచి 30 వరకు ఆర్జేడీకి సంబంధిత డీఈఓ ద్వారా అప్పీలు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
No comments:
Post a Comment