నేడు ఐసెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలోని ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఎపిఐసెట్ 2020 నోటిఫికేషన్ షెడ్యూల్ ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఎపిఐ సెట్ కన్వీనర్ ఎంఎం నాయక్ షెడ్యూల్ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుందని ఈ నెల 25 నుంచి 31 వరకూ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. ఈ నెల 25 నుంచి 29 వరకూ ధ్రువపత్రాల పరిశీలన, 28 నుంచి 31 వరకూ కళాశాల ఎంపిక ఆప్షన్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 2న సీట్లు కేటాయింపులు జరుగుతాయని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment