ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
జనవరి 23న తొలి దశ,27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా ఫిబ్రవరి 5,9,13,17న రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. అయితే ఏపీ సీఎస్తో భేటీ జరిగిన కొద్దిసేపటికే ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరించి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ ఎస్ఈసీని సీఎస్ కోరారు. దీనికి సంబంధించి సీఎస్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనవరి 23 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
ఈ నెల 23 న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్
ఈనెల 27 న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
ఈనెల 31 న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
ఫిబ్రవరి 4 న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
ఫిబ్రవరి 5 నతొలి దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 9*న రెండో దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 17 న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు
ఏపీలో రేపటి నుండి అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్...
No comments:
Post a Comment