బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాటన్పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ అమల్లోకి రానుంది
బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!
ధరలు పెరిగేవి
ఎలక్ట్రానిక్ వస్తువులు
మొబైల్ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)
చెప్పులు
పర్సులు
చార్జర్స్(మొబైల్ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు)
సింథటిక్ జెమ్స్టోన్స్
లెదర్ ఉత్పత్తులు
సోలార్ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు)
సోలార్ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు)
ఆటో విడిభాగాలు
స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)
కాటన్(0 నుంచి 10 శాతం)
రా సిల్స్, యాన్ సిల్క్(10 నుంచి 15 శాతానికి పెంపు)
ఆల్కహాలిక్ బీవెరేజెస్
క్రూడ్ పామాయిల్
క్రూడ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్
ఆపిల్స్
బొగ్గు, లిగ్నైట్, పిట్
యూరియా తదితర ఫర్టిలైజర్లు
బఠాణీలు
కాబూలీ శనగలు
బెంగాల్ గ్రాం
పప్పులు
ధరలు తగ్గేవి
ఐరన్
స్టీలు
నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్
కాపర్ వస్తువులు
ఇన్సూరెన్స్
షూస్
బంగారం, వెండి ధరలు
నాప్తా(హైడ్రోకార్బన్ లిక్విడ్ మిక్చర్)
బడ్జెట్ లైవ్ అప్డేట్స్..
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట
ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు
బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు
2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం
2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం
2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం
ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గానికి ఊరట
గృహరుణ మినహాయింపులు 2022, మార్చి 31 వరకు కొనసాగింపు
స్టార్టప్లకు ఇచ్చే తాయిలాలు మరో ఏడాది పొడిగింపు
పెరిగేవి : తరిగేవి, దిగి రానున్న పుత్తడి ధర
మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ డీజిల్పై రూ.4 వ్యవసాయ సెస్సు
పెట్రోల్ లీటర్కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు
పెరగనున్న మొబైల్ ధరలు
అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ
ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
రాగిపై పన్ను మినహాయింపులు
పెరగనున్న సోలార్ ఇన్వెటర్ల ధరలు
ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు
పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
కాటన్పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపు
దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు
పెరగనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు
సీనియర్ సిటిజన్లకు ఊరట
పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు.
75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు
ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం
ఎన్నారైలు భారత్లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు
ఎన్ఐఆర్లకు డబుల్ టాక్సేషన్నుంచి ఊరట
పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు
అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు
ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్కు ప్రోత్సాహం
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ
15 వేల పాఠశాలలు శక్తివంతం
కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
ఎన్జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
లెహ్, లడఖ్లో యూనివర్సిటీ ఏర్పాటు
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ
ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ
2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ
రైతుల సంక్షేమం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు
మౌలిక రంగానికి భారీగా నిధులు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు
తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు
విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
జమ్మూకశ్మీర్లో గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు
కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం
సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు
బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం
మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు
ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలు బ్యాడ్ బ్యాంక్కు బదలాయింపు
ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
బీమా రంగంలో ఎఫ్డీఐలు 74 శాతానికి పెంపు
2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
జల జీవన్ మిషన్కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు
మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్
కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
No comments:
Post a Comment