- మే 1 నుంచి పదో తరగతి కి వేసవి సెలవులు
- జూన్ 7 నుంచి పరీక్షలు యథాతథం
- ఇంటర్ విద్యార్థులకూ వేసవి సెలవులు
- విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థులకు మే ఒకటి నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కడపలో సోమవారం ప్రకటించారు. పదో తరగతికి సిలబస్ మొత్తం పూర్తయిన పరిస్థితుల్లో మే 31 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తోందని వెల్లడించారు. కడపలో కోవిడ్ రెండో దశ సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నారు . కోవిడ్ వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా విద్యాలయాల గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే పదో తరగతికి సెలవులు ప్రకటించారన్నారు. జూన్ ఒకటి నుంచి టీచర్లు బడికి వచ్చి జూన్ 7 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని విద్యామంత్రి కోరారు. జూనియర్ కశాళాలలకు కూడా మే 1 నుంచి సెలవులే అని చెప్పారు. సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి విద్యార్థులందరూ పరీక్షలకు బాగా సిద్ధం కావాలని మంత్రి సూచించారు. అవసరం మేరకు విద్యామృతం, విద్య కలశం లను పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు దోహదపడే విధంగా ఆన్ లైను క్లాసులు కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment