కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష
➤ రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించారు.
➤రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు.
➤వాలంటీర్, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్పై దృష్టి సారించాలన్నారు
➖➖➖➖➖➖➖➖➖➖
ఈ రోజు AP CM జిల్లా అధికారుల తో కోవిడ్-19 పై వీడియో కాన్ఫరెన్సు.పాఠశాలల ను నడపటం పై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం
➧10 మరియు ఇంటర్ పరీక్షలపై త్వరలో విద్యాశాఖ తో సమీక్ష
➧e-SR పై హడావుడి లేదు.(April-2021 Salaries తో లింక్ లేదు )
➧DA 3rd instalment Bills ఈ రోజు నుండి Submit అవుతాయి
➧2 instalments inka జమ కాలేదు గమనించవలెను
No comments:
Post a Comment