విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: ఆదిమూలపు
రాష్ట్రంలో
2021-22కు విడుదల చేసిన మొత్తం 10,143
ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు
భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక, ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు
లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని
తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటికి విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు
భర్తీ చేసినట్టు మంత్రి తెలిపారు.
ఇప్పుడు 2021-22 లో మొత్తం 1238 బ్యాక్
లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు
ఉన్నాయి. అందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి.
మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ
కేటగిరికి చెందినవని మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు జూలై 2021లో
నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్
పోస్టుల భర్తీ చేయనుండగా జనవరి 2022లో
వీటికి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
యూనివర్సిటీల్లో 2000
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022లో
నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అవకాశాలు కల్పించటం జరుగుతుందని, దళారులు, లంచగొండితనం
లేకుండా మెరిట్ మీదనే ఉద్యోగాలు దక్కటంతో అందరూ జగనన్నను అభినందిస్తున్నారని
మంత్రి సురేష్ అన్నారు.
No comments:
Post a Comment