వివరాల నవీకరణతోనే ‘అమ్మఒడి’!
బ్యాంకింగ్ రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు బ్యాంకుల విలీన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించింది. ఇలా విలీనమైన బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్ఎస్ కోడ్లు మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధి చేకూరాలంటే మారిన కోడ్ల వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా బ్యాంకుల ఖాతా సంఖ్యలు మారకున్నా ఐఎఫ్ఎస్ కోడ్ మారింది. సదరు కోడ్ను అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్లో అప్డేట్ చేయించుకోని వారికి వచ్చే ఏడాది జనవరిలో పథకానికి సంబంధించిన నగదు జమకాదు.
మార్చి నెలాఖరు వరకు పాత కోడ్లతోనే..
విలీనం కావడం ద్వారా పలు బ్యాంకులకు సంబంధించి మారిన ఐఎఫ్ఎస్ కోడ్లు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. మార్చి 31 వరకు పాత కోడ్ల ద్వారానే అమ్మఒడి పథకం లబ్ధిని చేకూర్చారు. 2021-22 విద్యా సంవత్సరం ప్రయోజనం పొందాలంటే ఐఎఫ్ఎస్ కోడ్ను మార్చుకోవడం తప్పనిసరి. ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ప్రకారం లబ్ధిదారులకు సంబంధించిన ఐఎఫ్ఎస్ కోడ్లు మార్చినట్లు జిల్లా విద్యా శాఖ వర్గాల వారు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి ఇంకా అర్హులైన వారుంటే సదరు తల్లులకు చెందిన బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్లనూ ఛైల్డ్ ఇన్ఫో డేటా ద్వారా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెబుతున్నారు.
No comments:
Post a Comment