డీఎస్సీ-2008 అభ్యర్థులకు నియామక పత్రాలు
కర్నూలు : డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అర్హులైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేశారు. ముందుగా ఖాళీ స్థానాల కోసం మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల జాబితాను శిబిరంలో అందుబాటులో ఉంచారు. దీని ఆధారంగా జిల్లా విద్యాధికారి ఎం.సాయిరాం అధ్యక్షతన మంత్రణం నిర్వహించి నియామకాలు చేపట్టారు. ఈ ప్రక్రియలో ఏడీ1-శ్యామల్ పాల్, మీనాక్షి, సూపరింటెండెంట్ రాజశేఖర్, ఉపవిద్యాధికారిణి అనురాధ పాల్గొన్నారు. వీరికి మినిమం టైం స్కేలుతో ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాలో 463 మందికిగాను ధ్రువపత్రాల పరిశీలనకు 184 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో తెలుగు ఎస్జీటీ అభ్యర్థులు మూడో కేటగిరి పాఠశాలలను 173 మంది, నాలుగో కేటగిరి పాఠశాలలను ఏడుగురు మిగిలిన ఉర్దూ, కన్నడ అభ్యర్థులు మూడో కేటగిరిలోని పాఠశాలలను ఎంపిక చేసుకున్నారని డీఈవో ఎం.సాయిరాం తెలిపారు. నాలుగో కేటగిరిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేదని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment