INCOME TAX : రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
- ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
- డిసెంబర్ 31,2021 వరకు అవకాశం
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 30, 2021 నుంచి డిసెంబర్ 30, 2021 వరకు అవకాశం కల్పిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. ఖాతాలు ఆడిట్ చేయాల్సిన అవసరంలేని, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫామ్స్ వర్తించే వ్యక్తిగత చెల్లింపుదార్ల గడువు వర్తిస్తుంది. ఆదాయ పన్ను చట్టం కింద 2021-22 అంచనా ఏడాదికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులు, ఆదాయ పన్ను దాఖలులో ఎదురవుతున్న ఇబ్బందులపై పన్ను చెల్లింపుదారులు, భాగస్వాముల నుంచి ఫిర్యాదులు అందిననేపథ్యంలో గడువును పొడిగించినట్టు ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా 2020-21కి సంబంధించిన వ్యక్తిగత ఐటీఆర్ దాఖలు గడువు ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించబడింది. అయితే కొత్త ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ప్రారంభం నుంచి ఇతర | సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. దీంతో పోర్టల్ రూపొందించిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే భేటీ అయ్యారు. అన్ని సమస్యలను సరిదిద్దేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువిచ్చారు. ఆ తర్వాత పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి ఐటీఆర్ దాఖలు గడువును ఆర్థిక శాఖ పొడిగించింది.
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి.
‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది.
No comments:
Post a Comment