నేటినుంచి పారా మెడికల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
డీఎస్సీ ద్వారా 1,317 పోస్టులకు నియామకాలు
వైద్య, ఆరోగ్య శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1,317 పారా మెడి కల్ పోస్టుల నియామకానికి శనివారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇటీ వల వైద్య శాఖలో భారీ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా పోస్టుల భర్తీకి ఆదివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెం బర్ 15వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 17న ప్రొవిజనల్ మెరి ట్ లిస్ట్ ప్రకటిస్తారు. 18-20వ తేదీల మధ్య అభ్యంతరాల స్వీకరణ, 21, 22 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 23న తుది మెరిట్ జాబితా ప్రక టించి.. ఎంపికైన వారికి 27, 28వ తేదీల్లో నియామక ఉత్తర్వులు ఇస్తారు.
ఉద్యోగాలు ఇలా...
మొత్తం 1,317 ఉద్యోగాల్లో 149 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్, 17 గ్రేడ్-2 ఫార్మాసిస్ట్, 839 ఎఫ్ఎనోవో, 312 శానిటరీ అటెండర్, వాచ్మన్ పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఎఫ్ఎన్ వో, శానిటరీ అటెండర్, వాచ్మెన్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.
No comments:
Post a Comment