Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP News: పీఆర్‌సీపై సీఎం జగన్‌ సమీక్ష .. రెండ్రోజుల్లో ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం ?

AP News: పీఆర్‌సీపై సీఎం జగన్‌ సమీక్ష .. రెండ్రోజుల్లో ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం ?


అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పీఆర్‌సీ సహా పలు పెండింగ్‌ హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న దృష్ట్యా వారి సమస్యలకు సత్వర పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి  ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వేతన సవరణ అంశంపై అధికారులతో సీఎం సమగ్రంగా చర్చించారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సమావేశంలో  చర్చ జరిగింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం.. ఉద్యోగులకు ఎంతమేర వేతనాలు పెంచాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎంత మేర ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వానికి సాధ్యమనే విషయమై సీఎం ఆర్థికశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఇప్పటికే 27శాతం మధ్యంతర భృతి ఇస్తుండగా.. ఆపై ఎంతమేర ఫిట్‌మెంట్‌ పెంచితే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారులను సీఎం అడిగారు.


ఈ అంశంపై ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికను ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకు అందజేశారు. వీటితో పాటు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్‌ అయిన సీపీఎస్‌ రద్దు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. సీపీఎస్‌ రద్దు చేస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుంది? ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది? ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్టోబరులో పర్మినెంట్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. లక్షా 10వేల మందికి పైగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సర్వీసులను పర్మినెంట్‌ చేసే అంశంపైనా అధికారులతో సీఎం చర్చించినట్టు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ, తదితర డిమాండ్లపై చర్చించారు. వీటన్నింటిపై తగు కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది. 10 రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఇవాళ్టి సమావేశంలో ఫిట్‌ మెంట్‌ ఎంత మేర ఇవ్వాలనే విషయంపై సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 3 రోజుల్లోపే పీఆర్‌సీపై ప్రభుత్వ ప్రకటన చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.  


ముందుగా పీఆర్‌సీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసి.. ఆపై ఉద్యోగులతో తుది విడత చర్చలు జరిపి వారి సమ్మతితో ప్రకటన చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందా? లేక ప్రభుత్వమే నేరుగా ప్రకటన చేస్తుందా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయిస్తే.. రేపో, ఎల్లుండో చర్చలు జరిగే అవకాశముంది.  ఫిట్‌మెంట్‌పై వారితో చర్చించే అవకాశాలున్నాయి. సీఎం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకు అధికారులు తెలియజేసే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలను అధికారులు ఒప్పించి అనంతరం ఫిట్ మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND