లాటరీ పద్దతిలో గురుకులం సీట్లు
నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు సంస్థ ( ఎపిఆర్ఐఎస్ ) లో 5 వ తరగతి సీట్లను 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో లాటరీ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు తెలిపారు . ఈ మేరకు ఆయన నోటిఫికేషన్ వివరాలతో ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు .
రాష్ట్ర వ్యాప్తంగా 38 సాధారణ , 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలురు పాఠశాలలు గుంటూరు జిల్లా , తాడికొండ , అనంతపురం జిల్లా కొడిగెనహళ్లితో సహా 5 వ తరగతి ( ఇంగ్లీషు మీడియం ) లో ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి ( లాటరీ ) ద్వారా 2022 జూన్ 10 న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు .
దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం http://aprs.apcfss.in చూడాలన్నారు .
దరఖాస్తులు ఆన్లైన్లో ఈ నెల 9 నుంచి 31 వరకు స్వీకరించబడతాయని పేర్కొన్నారు .
No comments:
Post a Comment