జేఈఈ ‘రెండేళ్ల' నిబంధన సడలింపునకు నో
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షకు హాజర య్యేందుకు రెండేళ్ల నిబంధన నుంచి సడలింపునివ్వాలని కోరుతూ దాఖ లైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కొవిడ్ మహ మ్మారి కారణంగా 2021లో కొంతమంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కాలేకపోయారు. గతేడాది జేఈఈ అడ్వాన్సుడ్కు హాజరైన ప్పటికీ.. సాంకేతిక సమస్యలతో చాలామంది సరైన స్కోరు సాధించలేకపో . అయితే అదే వారికి చివరి అవకాశం కావడంతో ఈ ఏడాది కూడా తమకు పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని కోరుతూ 67 మంది విద్యా ర్ధులు ఢిల్లీ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది.
‘75 శాతం పై ప్రభుత్వమే నిర్ణయించాలి. బాంబే హైకోర్టు* ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతి పరీక్షల్లో 75 శాతం మార్కులను < తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, ప్రభుత్వ అధికారులే పరిశీలించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, జస్టిస్ సందీప్ మార్నే లాతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ ఏడాది విడుదల చేసిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్డ్ బ్రోచర్ ప్రకారం 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అభ్యర్థులు కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి అనే నిబంధనను చేర్చారు. అయితే గతేడాది వరకు ఈ నిబంధన లేదని, దీన్ని తొలగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అనుభా సహాయ్ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
No comments:
Post a Comment