ఐటీఆర్ దాఖలుకు జులై 31 ఆఖరుఇకపై గడువు పొడిగింపు ఉండదు: కేంద్ర రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రి త్వశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే ఎక్కువగా ఫైలింగ్ జరుగుతుందని భావిస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఐటీఆర్ ఫైలింగ్ చాలావేగంగా ఉందని, రిటర్న్ లు దాఖలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిజేస్తున్నామన్నారు. చివరి క్షణం వరకు ఆగవద్దని, గడువు ముగింపు వరకు వేచిచూడొద్దని, పొడిగింపు ఉండవచ్చని ఆశించొద్దన్నారు. 2022-23 < అసెస్మెంట్ ఇయర్కు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుందని, వీలైనంత త్వరగా రిటర్నులను దాఖలు చేయాలని సూచించారు.
No comments:
Post a Comment