- 3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
- 14 నుంచి 24 వరకు దసరా సెలవులు.
రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసె స్మెంట్ (ఎఫ్ఎ)-2 పరీక్షలు నిర్వహించనుం ది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉ న్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వి ద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్ష లు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధా రంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతా యి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మం డల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యా యులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలలు హెచ్ఎంలకు ప్రశ్నాపత్రా లు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతా ధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తర గతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ. ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంక నం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్ లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయా లని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమా వేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియ జేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
No comments:
Post a Comment