గ్రామ వాలంటీర్' పోస్టులకు 2.58 లక్షల దరఖాస్తులు
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10తో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 30 వేలకు పైగా గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీటిలో 10,908 గ్రామ వాలంటీర్ పోస్టులు ఉండగా.. 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు కలిపి మొత్తం 30,078 పోస్టులు ఉన్నాయి.
నవంబరు 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నిర్ణీత గడువులోగా మొత్తం 2,58,972 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియ నవంబరు 11న ప్రారంభమైంది. నవంబరు 11న మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి అధికారులు 358 దరఖాస్తులను అధికారులు పరిశీలించగా.. వీటిలో 194 దరఖాస్తులను మాత్రమే అప్రూవ్ చేశారు. సరిగాలేని 164 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ ప్రక్రియ నవంబరు 15 వరకు కొనసాగనుంది.
నవంబరు 1 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య వయసుండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికచేసిన అభ్యర్థులకు నవంబరు 16 నుంచి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. తదనంతరం నవంబరు 22న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. వీరు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
➽ Check Your Application Status here for Phase-II
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10తో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 30 వేలకు పైగా గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీటిలో 10,908 గ్రామ వాలంటీర్ పోస్టులు ఉండగా.. 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు కలిపి మొత్తం 30,078 పోస్టులు ఉన్నాయి.
నవంబరు 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నిర్ణీత గడువులోగా మొత్తం 2,58,972 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియ నవంబరు 11న ప్రారంభమైంది. నవంబరు 11న మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి అధికారులు 358 దరఖాస్తులను అధికారులు పరిశీలించగా.. వీటిలో 194 దరఖాస్తులను మాత్రమే అప్రూవ్ చేశారు. సరిగాలేని 164 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ ప్రక్రియ నవంబరు 15 వరకు కొనసాగనుంది.
నవంబరు 1 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య వయసుండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికచేసిన అభ్యర్థులకు నవంబరు 16 నుంచి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. తదనంతరం నవంబరు 22న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. వీరు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
➽ Check Your Application Status here for Phase-II
No comments:
Post a Comment