పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
* విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి
* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
మార్చిలో జరగనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో విద్యా సంబంధిత అంశాలపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పది, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. మొత్తం కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని, కావలసిన వసతులు విద్యార్థులకు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు ట్రెజరీలు, పోలీస్ స్టేషన్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రంలో చేసిన మార్పులను విద్యార్థులందరికీ అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లాల్లో డిఇఒలు ఈ విషయంపై బాధ్యతగా వ్యవహరించేలా చూడాలని అన్నారు. ఇప్పటికే మోడల్ పేపర్లు వెబ్సైట్లో ఉంచామని అధికారులు వివరించారు. పరీక్షా కేంద్రాల లోకేషన్ను విద్యార్థులకు తెలిసేలా యాప్ను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో తీసుకున్న మార్పుల్లో భాగంగా మెనూ సక్రమంగా అమలు కావాలని ఆదేశించారు. ముఖ్యంగా చిక్కీ టెండర్ విషయంలోనూ, నాణ్యమైన భోజనం అందించడంలోనూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంగ్లీషు మీడియం అమలు చేయటంలో తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో పాఠశాల విద్య ప్రభుత్వ సలహాదారు మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శులు సాంబశివారెడ్డి, రాజశేఖరరెడ్డి, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంగ్లీషు మీడియం అమలు ప్రత్యేకాధికారి వెట్రి సెల్వి, ఎస్పిడి చిన్న వీరభద్రుడు, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
* విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి
* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
మార్చిలో జరగనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో విద్యా సంబంధిత అంశాలపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పది, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. మొత్తం కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని, కావలసిన వసతులు విద్యార్థులకు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు ట్రెజరీలు, పోలీస్ స్టేషన్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రంలో చేసిన మార్పులను విద్యార్థులందరికీ అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లాల్లో డిఇఒలు ఈ విషయంపై బాధ్యతగా వ్యవహరించేలా చూడాలని అన్నారు. ఇప్పటికే మోడల్ పేపర్లు వెబ్సైట్లో ఉంచామని అధికారులు వివరించారు. పరీక్షా కేంద్రాల లోకేషన్ను విద్యార్థులకు తెలిసేలా యాప్ను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో తీసుకున్న మార్పుల్లో భాగంగా మెనూ సక్రమంగా అమలు కావాలని ఆదేశించారు. ముఖ్యంగా చిక్కీ టెండర్ విషయంలోనూ, నాణ్యమైన భోజనం అందించడంలోనూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంగ్లీషు మీడియం అమలు చేయటంలో తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో పాఠశాల విద్య ప్రభుత్వ సలహాదారు మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శులు సాంబశివారెడ్డి, రాజశేఖరరెడ్డి, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంగ్లీషు మీడియం అమలు ప్రత్యేకాధికారి వెట్రి సెల్వి, ఎస్పిడి చిన్న వీరభద్రుడు, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
As stated by Stanford Medical, It is really the one and ONLY reason women in this country get to live 10 years more and weigh an average of 19 kilos lighter than we do.
ReplyDelete(Just so you know, it has absolutely NOTHING to do with genetics or some secret diet and really, EVERYTHING to do with "HOW" they eat.)
BTW, I said "HOW", not "what"...
Tap on this link to uncover if this easy questionnaire can help you find out your true weight loss possibility