ఏ.పీ లో వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు..
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా నివారణకు పోలీసులు, పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను సీఎం ప్రశంసించారు.
కరోనా కారణంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జీతాల్లో కోతపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఇంకా జీతాలు అందలేదు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ 3 కేటగిరీలకు పూర్తి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా నివారణకు పోలీసులు, పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను సీఎం ప్రశంసించారు.
కరోనా కారణంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జీతాల్లో కోతపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఇంకా జీతాలు అందలేదు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ 3 కేటగిరీలకు పూర్తి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
No comments:
Post a Comment