అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్టోబర్ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్ ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ మేరకు అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వీలుంటే సీఎం వైఎస్ జగన్ ఏదైనా స్కూల్కు కూడా వెళ్తారని మంత్రి సురేష్ తెలిపారు
గౌరవ ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ - ముఖ్యాంశాలు
1. "మన బడి నాడు నేడు " కార్యక్రమం క్రింద పెండింగ్ లో ఉన్న చెల్లింపులు...అక్టోబర్ మొదటి వారం లోపల చెల్లిస్తామని సంబంధిత ఏర్పాట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
2. పాఠశాలలు రీ ఒపెనింగ్ ని కరోనా కోవిడ్19 నేపథ్యం లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 2 కి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది.
3. JVK "జగనన్న విద్యా కానుక " కిట్ల పంపిణీ ని అక్టోబర్ 5 న చేపట్టాలని...నవంబర్ 2 వ తేదీ లోపల విద్యార్థులు కొత్త బట్టలు కుట్టించుకొని స్కూల్స్ కి వెళ్ళడానికి తయారు అవుతారని ~
కుదిరితే ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా ఏదైనా జిల్లాలో పాల్గొంటానని తెలిపారు...
No comments:
Post a Comment