ఏఎన్యూకు ‘సచివాలయ’ జవాబు పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల జవాబు పత్రాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి తీసుకురానున్నారు. తొలుత వాటిని ఆయా జిల్లాల కేంద్రాలకు తరలించి, ప్రత్యేక వాహనాల్లో ఏఎన్యూకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ బ్లాక్లో జిల్లాలవారీగా గదులు కేటాయించి వీటిని భద్రపరచనున్నారు. అన్ని జవాబు పత్రాలను స్కానింగ్ చేసేందుకు అధునాతన కంప్యూటర్లను ఇప్పటికే తరలించారు. జవాబు పత్రాలను భద్రపరిచే గదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment