నేడు ఉపాధ్యాయులందరూ హాజరు కావాల్సిందే
జారీ చేసిన పాఠశాల విద్య సంచాలకులు
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ సోమవారం విధులకు హాజరు కావాలని పాఠశాల విద్య సంచాలకులు చిన వీరభద్రుడు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన వారు బడులకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై సందిగ్ధత నెలకొనడంతో ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని, మంగళవారం నుంచి 50శాతం చొప్పున వెళ్లాలని సూచించారు. ఏకోపాధ్యాయులు రోజూ వెళ్లాలని పేర్కొన్నారు. మొదటిరోజు హాజరైన ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment