96.2 శాతం అక్షరాస్యతతో దేశంలో కేరళ ప్రథమస్థానం
జాతీయ నమూనా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : రాష్ట్రంలో 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ మరోసారి ప్రథమస్థానంలో నిలిచింది. హౌస్హోల్డ్ సోషల్ కన్సంప్షన్ : ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' అనే అంశంపై దేశంలో 2017-18లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 'జాతీయ నమూనా సర్వే'ను నిర్వహించింది. ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో అక్షరాస్యత రేటు గురించి రాష్ట్రాల వారీగా ఈ సర్వేను నిర్వహించి వివరాలను అందిస్తుంది. ఈ సర్వేలో కేరళ ఎప్పటిలానే అగ్రస్థానంలో నిలవగా, 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది. ఎపిలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతంగా ఉండగా, మహిళల్లో 59.5 శాతంగా ఉంది. ఈ సర్వే ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 73.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం 87.7 శాతంగా ఉంది. కేరళ అనంతరం 88.7 శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా, 87.6 శాతంతో ఉత్తరాఖండ్, 86.6 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 85.9 శాతంతో అసోం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలవగా, 72.8 శాతంతో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల్లో అక్షరాస్యత 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70. 3 శాతంగా ఉంది. కేరళ పురుషుల్లో అక్షరాస్యత 97.4 శాతంగా ఉండగా, మహిళల్లో అది 95.2 శాతంగా ఉంది. జాతీయ సగటు చూసుకుంటే పురుషుల్లో అక్షరాస్యత రేటు 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70.3 శాతంగా ఉంది.
జాతీయ నమూనా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : రాష్ట్రంలో 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ మరోసారి ప్రథమస్థానంలో నిలిచింది. హౌస్హోల్డ్ సోషల్ కన్సంప్షన్ : ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' అనే అంశంపై దేశంలో 2017-18లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 'జాతీయ నమూనా సర్వే'ను నిర్వహించింది. ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో అక్షరాస్యత రేటు గురించి రాష్ట్రాల వారీగా ఈ సర్వేను నిర్వహించి వివరాలను అందిస్తుంది. ఈ సర్వేలో కేరళ ఎప్పటిలానే అగ్రస్థానంలో నిలవగా, 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది. ఎపిలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతంగా ఉండగా, మహిళల్లో 59.5 శాతంగా ఉంది. ఈ సర్వే ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 73.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం 87.7 శాతంగా ఉంది. కేరళ అనంతరం 88.7 శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా, 87.6 శాతంతో ఉత్తరాఖండ్, 86.6 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 85.9 శాతంతో అసోం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలవగా, 72.8 శాతంతో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల్లో అక్షరాస్యత 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70. 3 శాతంగా ఉంది. కేరళ పురుషుల్లో అక్షరాస్యత 97.4 శాతంగా ఉండగా, మహిళల్లో అది 95.2 శాతంగా ఉంది. జాతీయ సగటు చూసుకుంటే పురుషుల్లో అక్షరాస్యత రేటు 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70.3 శాతంగా ఉంది.
No comments:
Post a Comment