12% వడ్డీ భారం ఎంతో తెలియజేయండి
వేతనాలు, పింఛన్ల బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
➤ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల బకాయిలకు 12% వడ్డీ చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో రెండు వారాల్లో అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
➤ మార్చి, ఏప్రిల్ నెలల వేతనాలు, పింఛన్ల బకాయిలను 12% వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. రెండు నెలల్లో బకాయిలు చెల్లించాలని బుధవారం ఆదేశించిన కోర్టు.. వడ్డీపై తాత్కాలిక స్టే ఇచ్చింది.
➤‘బకాయిలపై 12% వడ్డీ చెల్లించాలనే హైకోర్టు సూచనలపై స్టే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాం. తదుపరి విచారణలో వడ్డీ అంశాన్ని పరిశీలిస్తాం. జనవరి మూడో వారానికి వాయిదా వేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
No comments:
Post a Comment