పాఠశాలల పునః ప్రారంభ షెడ్యూల్ లో మార్పు
ఎనిమిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి బడి
డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతుల వారికి..
మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా.. 6, 7, తరగతుల ప్రారంభాన్ని డిసెంబరు 14కు వాయిదా వేసింది. డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ అనంతరం తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుండగా.. సోమవారం నుంచి ఎనిమిదో తరగతి వారికి పునఃప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు కొనసాగుతున్న పాఠశాలలను చలి కారణంగా ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.
➖➖➖➖➖
8 వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి తరగతులు
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 23 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 8, 9 తరగతి విద్యార్థులు రోజు తప్పించి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా, పదో తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూనే డిసెంబరు 14 నుంచి 6, 7 తగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. 14వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించుకుని 1 నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతున్న పాఠశాలలు, చలికాలం వల్ల ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సంక్రాంతి తరువాత 1 నుంచి 5వ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Reduced Syllabus..8th 9th 10th Class PDF links ..pettandi...sir...
ReplyDeleteMy whatsapp number
ReplyDelete9491518065..
Please upload Reduced Syllabus PDF links...