టెన్త్ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు
♦రేపటి నుంచి అమలు
♦103 రోజుల ప్రణాళిక
♦అదే రోజు నుంచి ఇంటర్
♦ఫస్టియర్ క్లాసులూ ప్రారంభం
♦వేసవి సెలవులు రద్దు
పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.
♦ఇంటర్కు 106 పనిదినాలు
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
No comments:
Post a Comment