ఫిబ్రవరిలో అన్ని తరగతులు !.
అధికారులకు సిఎం వైఎస్ జగన్ ఆదేశం..
ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులకూ పాఠశాలలు తెరిచే విషయంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రోజువారీ తరగతుల నిర్వహణపై కూడా ఆలోచన చేయాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పిల్లలు పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, గ్రామ వాలంటీర్తో యోగక్షేమాలు కనుక్కోవాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ దీనిపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఆరోగ్యకరమైన పరిస్థితులను పాఠశాలలో తీసుకురావడానికి మరుగుదొడ్ల ఫండ్ను ఏర్పాటు చేశామన్నారు. వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలని, ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా శుభ్రం చేయాలని సూచించారు. వీటి నిర్వహణలో సులభ్ వంటి సంస్థల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. విద్యా కానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి తప్పనిసరిగా కానుక కిట్లు అందించాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు పర్యవేక్షణ కోసం వేర్వేరుగా యాప్లు తయారు చేశామని అధికారులు సిఎంకు వివరించారు. రోజూ విద్యార్ధుల హాజరును యాప్లో నమోదు చేస్తున్నామని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉందని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, పాఠశాల, కళాశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్, కమిషనర్ వి చినవీరభద్రుడు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఎస్ఎస్ఎ డైరెక్టర్ కె వెట్రిసెల్వి తదితరులు పాల్గన్నారు.
- ఫిబ్రవరిలో 1-5 తరగతులు
- ప్రారంభించే అంశాన్ని పరిశీలించండి
- బడుల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి
- విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మరుగుదొడ్లు లేకపోవడం, సక్రమంగా నిర్వహించకపోవడంతో చాలావరకు పాఠశాలలకు పిల్లలు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి 1-5 తరగతులకు కూడా పాఠశాలలు తెరవడంతో పాటు గతంలో మాదిరిగా అన్ని పీరియడ్స్ బోధించే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం రూపొందించిన మొబైల్ యాప్లపై సీఎం జగన్.. మంత్రి ఆదిమూలపు సురేశ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ‘మరుగుదొడ్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, పాఠశాల, కళాశాల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇది ప్రాధాన్యాంశం. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయాలి. శుభ్రం చేసేందుకు వాడే రసాయనాలపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించాలి. సులభ్ వంటి సంస్థల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యాసంస్థలను ‘నాడు-నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంతో నాణ్యమైన బోధనను అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థుల పోషకాహారం కోసం గోరుముద్దను అమలు చేస్తున్నాం’ అని సీఎం జగన్ వెల్లడించారు.
➤విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్: ‘విద్యార్థులు పాఠశాలలకు రాకపోతే తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు వెళ్లాలి. వాలంటీర్తో వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు దీన్ని పర్యవేక్షించాలి. యాప్లోని హాజరు వివరాలను తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించాలి’ అని సీఎం ఆదేశించారు.
No comments:
Post a Comment