మే నుంచి నాడు- నేడు రెండో దశ ప్రారంభం
పాఠశాలలో మే నుంచి 'నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కే.రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కనిగి రిలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడారు. నాడు నేడు మొదటి దశ పనులను ఈ నెలాఖరుకు సీఎం చేతులమీదుగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో మొదటి దశలో 1324 పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. అన్ని రకాల వస తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యిందన్నారు. తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల సంయుక్త కృషి వలన మొదటి దశ నాడు నేడు పనులు విజయవంతం అయ్యిందన్నారు. రెండవ దశలో అభివృద్ధి చేయాల్సిన పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. మూడవదశలో 100 శాతం పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. నాడు-నేడు, గోరుముద్ద. విద్యా కానుక, ఆంగ్ల మాధ్యమం వలన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని ఆర్జేడీ పేర్కొన్నారు.
No comments:
Post a Comment