- ఇన్విజిలేటర్లు అందరికీ వ్యాక్సిన్
- కోవిడ్ ప్రొటోకాల్కు అనుగుణంగా పరీక్షలు
- ప్రతి కేంద్రంలో ఐసోలేషన్ గది
- మంత్రి ఆదిమూలపు సురేష్ గారు
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లు అందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఆదేశించారు. శుక్రవారం సమగ్ర శిక్షణ కార్యాలయం నుంచి ఆయన ఉన్నతాధికారులతో పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో అధికారులు పూర్తి బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఇన్విజిలేటర్లకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియలో ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్ వేయించు కున్నారని ఇక మిగిలిన వారికి కూడా టీకా వేస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రంలో థర్మల్ స్కానర్లు, మాస్క్లు, ఇతర అవసరమైన ఏర్పాట్లను తక్షణమే ఆయా జిల్లా ల వైద్య శాఖ అధికారులు పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ గదిని తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి కేంద్రంలో 5 పీపీఈ కిట్లు
ప్రతి కేంద్రంలో ఐదు పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులకు నమ్మకం ఉండేలా ఏర్పాట్లు జరగాలని మంత్రి నిర్దేశించారు. ప్రవేశ కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కచ్చితమైన రూట్ మ్యాపు ఇవ్వాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పటిష్టంగా చేయాలని భారీగా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తల తో పరీక్షలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, బోర్డు కార్యదర్శి రామకృష్ణ అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment