- డిపార్ట్మెంటల్ టెస్టులకు మరో చాన్స్
- గతంలో దరఖాస్తు చేసుకోని వారికే: ఏపీపీఎస్సీ
డిపార్ట్మెంటల్ టెస్ట్(2020 నవంబర్ సెషన్)లకు గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పీఎ్సఆర్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో.. జీవీడబ్ల్యువీ, వీఎ్సడబ్ల్యుఎస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నుంచి వచ్చిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులు మే 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదే పేపర్ కోడ్లకు గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
No comments:
Post a Comment