టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం జిల్లా
★ కోర్టు కేసుల కారణంగా గతంలో బదిలీలు కాకుండా మిగిలిపోయిన 24 మంది టీచర్లకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ శామ్యూల్ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.
★ జిల్లా పరిషత్ యాజమాన్య స్కూళ్లలో 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని మున్సిపల్ యాజమాన్యంలో స్కూళ్ల విలీనం సమస్య కారణంగా ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది ఎస్జీటీలు బదిలీలు కాలేదన్నారు.
★ ఆ 24 మంది టీచర్లకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment