- ఓటర్ల జాబితాల్లో మార్పులకు ఏడాది పొడవునా అవకాశం
- రాష్ట్రాల సీఈవోలతో ప్రధాన ఎన్నికల కమిషనర్
దిల్లీ: దేశంలో ఓటర్ల జాబితాలు దోషరహితంగా, ఎప్పటికప్పుడు తాజా వివరాల సహితం(అప్డేటెడ్) గా ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సుశీల్ చంద్ర తెలిపారు. దీనికోసం ఏడాది పొడవునా కొత్త ఓటర్ల నమోదు కొనసాగించాలని, చిరునామా మార్పు, తప్పుల సవరణ కోరుకునే ప్రజలకు అవసరమైన సేవలను సత్వరమే అందించాలని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల(సీఈవో)కు ఆయన సూచించారు. తరచూ నిర్ణీత కాలవ్యవధిలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆయా సేవల్ని సత్వరమే, సాఫీగా అందించడంపై దృష్టిసారించాలన్నారు. మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన భేటీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులను ఉద్దేశించి సుశీల్ చంద్ర ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొని ఓటరు అనుకూల విధానాలను అమలుచేయాలని, వ్యయనియంత్రణలు పాటించాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీవ్కుమార్, అనూప్ చంద్ర పాండే, ఎన్నికల కమిషన్ సెక్రెటరీ జనరల్ ఉమేశ్ సిన్హా ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు.
No comments:
Post a Comment