Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

NATIONAL PENSION SCHEME :మొత్తం డబ్బు... ఒకేసారి ?... ఎన్‌పీఎస్ లో త్వరలో మార్పులు.

NATIONAL PENSION SCHEME (NPS)

మొత్తం డబ్బు... ఒకేసారి ?... ఎన్‌పీఎస్ లో త్వరలో మార్పులు.

న్యూఢిల్లీ : జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్)లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం... ఈ దిశగా పరిశీలన జరుగుతోంది. ఈ క్రమంలో... పెన్షన్ డబ్బు మొత్తాన్ని ఒకే దఫాలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగులకు ఇది ఉపశమనం కావచ్చని భావిస్తున్నారు.  ఈ క్రమంలో... జాతీయ పెన్షన్ విధానంలో మార్పులు చేయాల్సిన విషయమై పరిశీలన జరుగుతోంది. ఎన్‌పిఎస్‌ను మరింత వెసులుబాటు కలిగించే దిశగా ఈ మార్పులు చేస్తున్నారు. ఇవి ఓ కొలిక్కి వచ్చి, అమలైనపక్షంలో...  ఎక్కువ పన్ను మినహాయింపు, బీమా ఏజెంట్ల ఆసక్తిని పెంచడం, ఈ పథకాన్ని ద్రవ్యోల్బణంతో అనుసంధానించడం వంటి అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశముంటుంది.


ఎన్‌పిఎస్‌లో పలు మార్పులు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ సుప్రతీం బందోపాధ్యాయ వెల్లడించారు. ఎన్‌పీఎస్‌ను మరింత మెరుగుపరచడానికి ఇప్పటికే చర్యలను కూడా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కాగా... వీటిలో కొన్ని ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరికొన్ని వివరాలిలా ఉన్నాయి.


ఎన్‌పీఎస్‌లో మార్పులు జరిగినపక్షంలో పెట్టుబడిదారులు ఇప్పుడు తమ మొత్తం నిధిని క్రమంబద్ధ ఉపసంహరణ ప్రణాళిక(ఎస్‌డబ్ల్యుపీ) లో ఉంచగలుగుతారు. ఇది వారి లాభాలను పెంచుతుంది. ప్రస్తుతం, పెట్టుబడిదారులు తమ పదవీవిరమణ సమయంలో వారి కార్పస్‌లో 60 % మాత్రమే ఉపసంహరించుకోగలుగుతారు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీని కొనడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత... ఆ డబ్బు మీద, వారు జీవితాంతం ఆదాయాన్ని పొందుతూ ఉంటారు.

-------------------------------------------------------

NPS: 70 ఏళ్ల వ‌య‌సులోనూ పెన్ష‌న్ స్కీమ్‌లో చేరొచ్చు..

రూ. 5ల‌క్ష‌ల‌కు దిగువ‌న పెన్ష‌న్ కార్ప‌స్ ఉన్న చందాదారులు ఇక‌పై సేక‌రించిన మొత్తం కార్ప‌స్‌ను ఉపసంహ‌రించుకోవ‌చ్చు. యాన్యూటీల‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డీఏ) చందాదారులను అనుమతించింది.  ప్రస్తుతం, ప‌దవీ విర‌మ‌ణ స‌మ‌యంలో లేదా 60 ఏళ్లు నిండిన చందాదారులు పెన్ష‌న్ కార్ప‌స్ రూ. 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా ఉంటే పెన్ష‌న్ మొత్తం 60 శాతం మాత్ర‌మే ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగిలిన 40 శాతం మొత్తంతో బీమా సంస్థ‌లు ఆఫ‌ర్ చేస్తున్న యాన్యూటీల‌ను క‌చ్చితంగా కొనుగోలు చేయాలి.


అంతేకాకుండా, ఏక మొత్తంలో చేసే ఎన్‌పీఎస్ ముంద‌స్తు విత్‌డ్రాల ప‌రిమితి రూ.2.5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు గెజెట్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఇందుకు ముందు ఇది రూ.1 ల‌క్ష మాత్ర‌మే ఉండేది. చందాదారుల శాశ్వ‌త రిటైర్‌మెంట్ అక్కౌంట్లో సేక‌రించిన పెన్ష‌న్ మొత్తం రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే త‌క్కువ లేదా అధికారులు పేర్కొన్న ప‌రిమితి వ‌ర‌కు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే యాన్యూటీ కొనుగోలు చేయ‌న‌వ‌స‌రం లేకుండా చందాదారుడు సేక‌రించిన మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉంటుంది.


రెగ్యులేటర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ప్ర‌వేశ వయ‌స్సును కూడా గ‌రిష్టంగా 65 నుంచి 70 సంవత్స‌రాల‌కు పెంచింది.  నిష్క్రమణ వయోపరిమితిని 75 సంవత్సరాలకు పెంచారు. అంటే 70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనూ ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND