122 మంది తాత్కాలిక ఎస్జీటీల నియామకం*
*(శ్రీకాకుళం): డీఎస్సీ-2008లో తుది జాబితా నుంచి తొలగించిన సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)అభ్యర్థులను ప్రభుత్వం తాత్కాలికంగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిణి కె.చంద్రకళ, ఉప విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మ చేతుల మీదుగా 122 మందికి నియామక పత్రాలను అందజేశారు.
No comments:
Post a Comment