డీఎస్సీ-08 అర్హత అభ్యర్థులకు కౌన్సెలింగ్
West Godavari: డీఎస్సీ అర్హత అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను స్థానిక జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. డీఎస్సీ-08 కామన్ సెలక్షన్ జాబితాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులను పాఠశాల విద్యా శాఖ ఆదేశాలమేరకు ఒప్పంద పద్ధతిలో నియమించేందుకు కౌన్సెలింగ్ చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఆర్.నరసింహారావు, జిల్లా విద్యా శాఖాధికారిణి సీవీ రేణుక సమక్షంలో ప్రక్రియ సాగింది. అనంతరం వారికి నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 188 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్కు 185 మంది హాజరయ్యారు. ఇందులో మైదాన ప్రాంత పాఠశాలలకు 178 మందిని, గిరిజన ప్రాంత పాఠశాలలకు ఆరుగురిని, ఐటీడీఏ ప్రాంత పాఠశాలకు ఒకరిని కేటాయించారు.
No comments:
Post a Comment