కేజీబీవీల్లో కొలువుల పండగ
శ్రీకాకుళం
➤కస్తూర్బా గాం ధీ బాలికా విద్యాలయాల్లో ( కేజీబీవీ ) కొలువుల పండగ జరగనుంది . డిసెం బర్ 20 వ తేదీలోపు వివిధ బోధన పో స్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులను వెలువరించారు . ఆదివారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు . జిల్లాలో వివిధ కేజీబీవీల్లో మొత్తం 98 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధచేస్తున్నారు .
➤వీటిల్లో ప్రిన్సిపాళ్లు 11 , పీఈటీలు 1 , సీఆర్ టీలు 35 , పీజీటీలు 29 , పీజీటీ ఒకేషనల్ 2 , ఎంపీహెచ్ డబ్ల్యూ 2 , ఎంఎలీ 4 , ఫౌండేషన్ కోర్సు 3 , ఇతర ఒకే షనల్ 11 పోస్టులను కలిపి మొత్తం 98 పోస్టులను భర్తీ చేయనున్నారు . ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హు లు . ఈ పోస్టులకు దరఖాస్తులు చేసే మహిళలు ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ వారికి 47 ఏళ్లు , ఇతరులకు 42 ఏళ్లు , దివ్యాంగులకు 52 ఏళ్ల వయో పరిమితి విధించారు . జిల్లా ఉన్నతాధికారులు ఆదేశానుసారం ఆదివారం నోటి ఫికేషన్ ఇస్తున్నామని సమగ్ర శిక్ష , జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రోణంకి జయప్రకాష్ తెలిపారు .
No comments:
Post a Comment