టెట్ పేపర్-2ఏ అర్హతల్లో మార్పు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2ఏ అర్హ తల్లో మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్నా పేపర్-2ఏకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఒక్కసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తోంది. టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపో తున్నందున ఈ మార్పు చేశారు.
No comments:
Post a Comment