- కేజీబీవీల్లో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం
- • ఈనెల 13 నుంచి 21 వరకు దరఖాస్తులకు గడువు
- • 22 , 23 తేదీలలో సర్టిఫికెట్లు పరిశీలన
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాల్లో ( కేజీబీవీ ) పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ , పీజీటీ , సీఆర్టీ , పీఈటీల బదిలీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు
2022 మే 31 వ తేదీ నాటికి ఒకే కేజీబీవీలో 5 సంవత్సరాలు విధులు నిర్వహిం చిన ప్రిన్సిపాల్స్ , 8 సంవత్సరాలు విధులు నిర్వ హించిన సీఆర్టీ , పీఈటీలు తప్పని సరిగా బది లీలకు అర్హులు.
అలాగే రెండేళ్లు పూర్తి చేసు కున్న బోధనా సిబ్బంది బదిలీలకు అర్హులు .
జిల్లా కలెక్టర్ , చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ ద్వారా బదిలీల ప్రక్రియను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు
ఇందుకు సం బంధించి ఈ నెల 13 వ తేదీ నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు .
22 , 23 తేదీల్లో దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన , 25 న జిల్లా పరిధిలో కేజీబీవీ పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టులతో కూడిన జాబితాను ప్రచురించి 26 వ తేదీన సీరియారిటీ జాబితాను విడుదల చేస్తారు .
దరఖాస్తుదారుల గ్రీవెన్స్ కోసం 27 , 28 తేదీలను కేటాయించారు
29 న ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు
ఆ దరఖాస్తు దారులు ఈనెల 30 , ఆగస్టు 1 వ తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేయాలి . ఆగష్టు 2 వ తేదీన బదిలీ చేసిన పాఠశాలలలో రిపోర్టు చేయాలి .
ఆ జిల్లా పరిధిలో కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది ఆన్లైన్ లో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు సంబంధిత ప్రిన్సిపాల్ , వారి కార్యాలయపు గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ను సంప్రదించవచ్చు .
No comments:
Post a Comment