పది పరీక్షల్లో ఐసొలేషన్ గదులు
♦అందరికీ మాస్కులు, థర్మల్ స్కానింగ్
♦పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సురేష్ వెల్లడి
పదోతరగతి పరీక్షల్లో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న విద్యార్థుల కోసం ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక గదిని ఇందుకు కేటాయిస్తారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు అందిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లతో శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. పదోతరగతి పరీక్షలపై మంగళవారం అధికారులతో సమీక్షించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. సామాన్య శాస్త్ర పరీక్షలో విద్యార్థులకు రెండు జవాబుపత్రాల బుక్లెట్లు ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రం పార్ట్-ఎలోని భౌతిక, రసాయన శాస్త్రాలకు ఒకటి, పార్టీ-బీలోని జీవశాస్త్ర ప్రశ్నలకు మరొకటి ఇస్తారు. సొంత ఊళ్లు వెళ్లిన విద్యార్థులకు వారి స్వస్థలాలకు సమీపంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం సాధ్యం కావట్లేదు. ఆచరణలో సమస్యలు వస్తున్నందున జంబ్లింగ్ పద్ధతిలోనే కేటాయిస్తారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పరీక్షల సమయంలో వసతిగృహాలు తెరుస్తారు. ఆరు రోజుల పాటు వారికి వసతి కల్పిస్తారు.
విద్యార్థుల మధ్య దూరం పాటించేందుకు ప్రతీ గదిలో 10-12 మందే కూర్చునేలా ఏర్పాట్లు.
ప్రస్తుతం 2,881 పరీక్ష కేంద్రాలుండగా వీటి సంఖ్య 4,154కి పెంపు. ఒకవేళ పరీక్ష కేంద్రం ఉన్న ప్రాంతం కట్టడి పరిధిలోకి వస్తే మార్పు కోసం అదనంగా 10% కేంద్రాల గుర్తింపు.
50వేల శానిటైజర్లు, 8 లక్షల మాస్కులు, 4,500 థర్మల్ స్కానర్ల కొనుగోలుకు అనుమతి. ఇన్విజిలేటర్లకు చేతి గ్లౌజుల సరఫరా.
సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలకూ ఇవే ఏర్పాట్లు. పదోతరగతి, ఇంటర్కు కలిపి 1.68 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
♦అందరికీ మాస్కులు, థర్మల్ స్కానింగ్
♦పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సురేష్ వెల్లడి
పదోతరగతి పరీక్షల్లో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న విద్యార్థుల కోసం ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక గదిని ఇందుకు కేటాయిస్తారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు అందిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లతో శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. పదోతరగతి పరీక్షలపై మంగళవారం అధికారులతో సమీక్షించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. సామాన్య శాస్త్ర పరీక్షలో విద్యార్థులకు రెండు జవాబుపత్రాల బుక్లెట్లు ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రం పార్ట్-ఎలోని భౌతిక, రసాయన శాస్త్రాలకు ఒకటి, పార్టీ-బీలోని జీవశాస్త్ర ప్రశ్నలకు మరొకటి ఇస్తారు. సొంత ఊళ్లు వెళ్లిన విద్యార్థులకు వారి స్వస్థలాలకు సమీపంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం సాధ్యం కావట్లేదు. ఆచరణలో సమస్యలు వస్తున్నందున జంబ్లింగ్ పద్ధతిలోనే కేటాయిస్తారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పరీక్షల సమయంలో వసతిగృహాలు తెరుస్తారు. ఆరు రోజుల పాటు వారికి వసతి కల్పిస్తారు.
విద్యార్థుల మధ్య దూరం పాటించేందుకు ప్రతీ గదిలో 10-12 మందే కూర్చునేలా ఏర్పాట్లు.
ప్రస్తుతం 2,881 పరీక్ష కేంద్రాలుండగా వీటి సంఖ్య 4,154కి పెంపు. ఒకవేళ పరీక్ష కేంద్రం ఉన్న ప్రాంతం కట్టడి పరిధిలోకి వస్తే మార్పు కోసం అదనంగా 10% కేంద్రాల గుర్తింపు.
50వేల శానిటైజర్లు, 8 లక్షల మాస్కులు, 4,500 థర్మల్ స్కానర్ల కొనుగోలుకు అనుమతి. ఇన్విజిలేటర్లకు చేతి గ్లౌజుల సరఫరా.
సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలకూ ఇవే ఏర్పాట్లు. పదోతరగతి, ఇంటర్కు కలిపి 1.68 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment