AP: డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు లైన్ క్లియర్.. త్వరలో ప్రారంభం కానున్న పరీక్షలు..!
➤సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టత ఏర్పడింది.
➤యూజీ, పీజీ చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు రూట్ క్లియరైంది. సెప్టెంబరు 30లోపు వీటిని పూర్తి చేయాలని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేయగా.. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే సమయం పెంపు కోసం యూజీసీని సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది.
యూజీ పీజీ పరీక్షలు
➤రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ అయా విశ్వవిద్యాలయాలకే అప్పగించింది. ఈ మేరకు కొన్ని వర్సిటీలు పరీక్షల షెడ్యూళ్లు ఇవ్వగా.. మరికొన్ని త్వరలో షెడ్యూల్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ఉండేందుకు విద్యార్థుల నివాసాలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ట్రిపుల్ఐటీ విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
➤Must read: అమ్మాయిలకు డీఆర్డీఓ స్కాలర్షిప్ .. ఏడాదికి రూ.1.86 లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్..!
ఆఫ్లైన్లోనే పరీక్షలు..?
పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సూచించింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మినహా రాష్ట్రంలోని వర్సిటీలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేకపోవడం, ఇంటర్నెట్ సమస్య కారణంగా ఆఫ్లైన్లో నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకటించిన పలు వర్సిటీలు:
➧జేఎన్టీయూ అనంతపురం సెప్టెంబరు మూడు నుంచి పరీక్షలు ప్రారంభించనుంది.
➧జేఎన్టీయూ- కాకినాడ సెప్టెంబరు రెండో వారం నుంచి ప్రారంభించాలని భావిస్తోంది.
➧శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ సైతం ఐదు నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
➧నాగార్జున వర్సిటీలో ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తికాగా మిగతావి సెప్టెంబరు 2నుంచి ప్రారంభం కానున్నాయి.
➧శ్రీవేంకటేశ్వర వర్సిటీ సెప్టెంబరు ఏడు నుంచి నిర్వహిస్తోంది.
➧ఆంధ్రా యూనివర్సిటీ ఇంకా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయలేదు.
➧అంబేద్కర్ వర్సిటీ పరిధిలో పీజీ చివరి ఏడాది పరీక్షలపై ఇంకా స్పష్టత రాలేదు
➤సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టత ఏర్పడింది.
➤యూజీ, పీజీ చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు రూట్ క్లియరైంది. సెప్టెంబరు 30లోపు వీటిని పూర్తి చేయాలని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేయగా.. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే సమయం పెంపు కోసం యూజీసీని సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది.
యూజీ పీజీ పరీక్షలు
➤రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ అయా విశ్వవిద్యాలయాలకే అప్పగించింది. ఈ మేరకు కొన్ని వర్సిటీలు పరీక్షల షెడ్యూళ్లు ఇవ్వగా.. మరికొన్ని త్వరలో షెడ్యూల్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ఉండేందుకు విద్యార్థుల నివాసాలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ట్రిపుల్ఐటీ విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
➤Must read: అమ్మాయిలకు డీఆర్డీఓ స్కాలర్షిప్ .. ఏడాదికి రూ.1.86 లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్..!
ఆఫ్లైన్లోనే పరీక్షలు..?
పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సూచించింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మినహా రాష్ట్రంలోని వర్సిటీలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేకపోవడం, ఇంటర్నెట్ సమస్య కారణంగా ఆఫ్లైన్లో నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకటించిన పలు వర్సిటీలు:
➧జేఎన్టీయూ అనంతపురం సెప్టెంబరు మూడు నుంచి పరీక్షలు ప్రారంభించనుంది.
➧జేఎన్టీయూ- కాకినాడ సెప్టెంబరు రెండో వారం నుంచి ప్రారంభించాలని భావిస్తోంది.
➧శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ సైతం ఐదు నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
➧నాగార్జున వర్సిటీలో ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తికాగా మిగతావి సెప్టెంబరు 2నుంచి ప్రారంభం కానున్నాయి.
➧శ్రీవేంకటేశ్వర వర్సిటీ సెప్టెంబరు ఏడు నుంచి నిర్వహిస్తోంది.
➧ఆంధ్రా యూనివర్సిటీ ఇంకా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయలేదు.
➧అంబేద్కర్ వర్సిటీ పరిధిలో పీజీ చివరి ఏడాది పరీక్షలపై ఇంకా స్పష్టత రాలేదు
No comments:
Post a Comment