ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ఆదేశించండి
హైకోర్టులో నేడు విచారణ
రాష్ట్రంలోని ఉపాధ్యాయు లందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పాఠశా లలు పునఃప్రారంభం కావడానికి, పదో తరగతి పరీక్షలు మొదలు కావడానికి ముందే ఉపాధ్యా యులందరికీ వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన ఉపా ధ్యాయుడు వై.ఉమాశంకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠ శాల విద్యాశాఖ కమిషనర్ తదితరులను ప్రతి వాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై గురు వారం న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేన్రెడ్డిలతో కూడిన ధర్మా సనం విచారించనుంది. ఉపాధ్యాయులు ప్రతీ రోజూ వందల మంది విద్యార్థులతో మాట్లాడు తుంటారని, అందువల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఉపాధ్యాయు లకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంద న్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
హైకోర్టు
ఏపీలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిల్...
ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు జరపాలని పిటిషన్..
టీచర్ల కు జూన్ 1లోపుగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న పిటిషనర్ .
నేడు హైకోర్టు లో విచారణ
No comments:
Post a Comment